SGSTV NEWS
CrimeTelangana

ఒరేయ్ పాపాత్ముడా.! నీకేం పోయేకాలంరా.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశావ్

మద్యానికి బానిసైన కొందరు.. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో వారికి అర్ధం అవ్వడం లేదు. తాగడానికి డబ్బులు కావాలి వాటి కోసం ఏమి చేయడానికి అయిన వెనుకడడం లేదు. అవసరమైతే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా బరి తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తాగుడికి ఫుల్లుగా బానిసైన ఓ వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని.. కట్టుకున్న భార్యనే హతమార్చాడు.


వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా తుప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతురాజుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కోపంతో భార్యను కర్రతో కొట్టి హతమార్చిన ఘటన స్థానికంగా జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆదివాసి అశోక్ అతని భార్య శివకాలి ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ గత కొద్దిరోజులుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. అతిగా మద్యానికి బానిసైన అశోక్ నిత్యం మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యను వేధించేవాడు. ఎప్పటిలాగే నిన్న రాత్రి డబ్బులు విషయంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఇక మద్యం మత్తులో ఉన్న భర్త అశోక్, భార్యపై కట్టెతో తల, చేతులు కాళ్లపై ఇష్టం వచ్చిన రీతిలో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తుప్రాన్ సీఐ రంగాకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share this