హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అక్రమంగా పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదాన్ని ఎత్తిచూపుతూ మాదాపూర్ పోలీసులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కవాతు నిర్వహించారు. ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటుండగా, అదే సమయంలో వాహనం దూసుకురావడంతో చనిపోయాడు. అయితే ప్రయాణికులను అలర్ట్ చేయడం కోసం ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కవాతు చేశారు. మాదాపూర్ ఇన్ స్పెక్టర్ జి.మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కె.అనిల్ కుమార్, కె.అజయ్ లు బ్రిడ్జిపై సెల్ఫీలు తీసుకుంటుండగా శనివారం ఎంయూవీ ఢీకొట్టింది. అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, అజయ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
ఈ ఘటనపై స్పందించిన మాదాపూర్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై, ముఖ్యంగా బ్రిడ్జిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెల్ఫీలు దిగుతూ పట్టుబడితే రూ.1,000 జరిమానా విధిస్తారు. నిర్లక్ష్యపు ప్రవర్తనను నిరోధించడానికి, ప్రజల్లో భద్రతకు భరోసా ఇవ్వడానికి కవాతు చేసినట్టు తెలిపారు
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





