ఇద్దరు యువకులు ఓ రోజు ఓయోలో రూమ్ బుక్ చేసుకున్నారు. డేటింగ్ యాప్లో ఇద్దరు కలిశారు. కట్ చేస్తే.. కలుసుకున్న రోజు రాత్రి అసలేం జరిగిందో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఈ ఘటన హైదరాబాద్లోకి మాదాపూర్లో చోటు చేసుకుంది. ఓ సారి లుక్కేయండి.
హైదరాబాద్లోని మాదాపూర్లో డేటింగ్ యాప్ మోసం బయటపడింది. ఓ డాక్టర్ డేటింగ్ యాప్ ద్వారా మోసానికి గురయ్యాడు. గ్రీండర్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు సదరు డాక్టర్పై అఘాయిత్యం చేయబోయాడు. అతడు నిరాకరించడంతో డబ్బులు కోసం బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి చేసేదేమీలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే..
గ్రీండర్ డేటింగ్ యాప్ ద్వారా సదరు డాక్టర్కు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ ఆ యాప్ ద్వారానే తరచూ చాటింగ్ చేశారు. ఇక ఒకానొక సమయంలో ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకుని.. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ఇక కలుసుకున్న రోజు ఆ యువకుడు డాక్టర్పై అత్యాచారం చేయబోయాడు. దానికి డాక్టర్ ప్రతిఘటించడంతో.. అతడిపై కోపంతో దాడి చేశాడు నిందితుడు. అంతేకాదు తనకు డబ్బులు ఇవ్వకుంటే ప్రైవేట్గా కలిసిన విషయాన్ని బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో భయపడ్డ డాక్టర్.. అతడికి రూ. 5 వేలు ఇచ్చాడు. అంతటితో ఆగని నిందితుడు డాక్టర్ను ఫాలో చేసి.. అతడు పని చేస్తున్న హాస్పిటల్కి వెళ్లి న్యూసెన్స్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించాడు వైద్యుడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!