ప్రపంచాన్ని వణికించిన కరోనాకు మందు కనిపెట్టాం. స్పేస్లో అద్భుతాలు చేస్తున్నాం. ఏఐ రంగంలో దూసుకుపోతున్నాం. అయినా సరే కొంతమంది మెదళ్ల నుంచి మూఢనమ్మకాలను మాత్రం దూరం చేయలేకపోతున్నాం. సమాజాన్ని ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. వివరాలు కథనం లోపల …
జంతు బలిచ్చి క్షుద్రపూజల నిర్వహించే వ్యక్తులు సహజంగా కోళ్లు.. మేకలు బలిస్తుంటారు.. మరీ బరితెగించిన వారు మనుషులు బలిచ్చినట్లు అక్కడక్కడా వింటుంటాం… కానీ ఈ బ్యాచ్ అదో టైపు.. పందిని ( వరాహాన్ని) బలిచ్చి అంతా హడలెత్తి పోయేలాచేశారు.. గ్రామ శివారులో పందిని బలిచ్చి క్షుద్రపూజల నిర్వహించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామశివారులో క్షుద్ర పూజలు నిర్వహించారు.. రోడ్డు పక్కనే పూజలు నిర్వహించి జనమంతా హడలెత్తి పోయేలా చేశారు.
ఐతే క్షుద్రపూజలు నిర్వహించిన ఆ దుండగులు వరహాన్నీ బలివ్వడం కలకలం రేపింది.. వరాహం తల భాగం నరికి ఆ రక్తంతో పూజలు నిర్వహించారు..ఆ మార్గంలో వెళ్తున్న గ్రామస్తులు ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి క్షుద్ర పూజలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు
Also read
- భార్యాభర్తల సెల్ఫీ వీడియో – ఆపై సూసైడ్ – భార్యాభర్తలిద్దరూ మృతి… వీడియో
- కురిక్యాల పాఠశాల ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం!
- Jangaon District :విద్యర్థులందరు భోజనం చేశాక సాంబార్లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన
- సినిమా రేంజ్ ట్విస్ట్.. భార్యను ఇంటికి పంపించి.. గుట్టుగా ఆ పని చేశాడు.. కట్ చేస్తే సీన్ ఇది
- Telangana: అంత చిన్న విషయానికే.. ఇంత దారుణమా.. అసలు ఏం జరిగిందంటే?





