కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..
ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.
Also Read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025