నిత్యం వేధిస్తున్న ఆకతాయికి తగిన బుద్ధి చెప్పింది యువతి. పక్కా స్కెచ్ వేసి పిలిపించి అందరి ముందు చితకబాదింది.
జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతి శివమెత్తింది. తనను వేధిస్తున్న ఆకతాయిలను తగిన బుద్ధి చెప్పింది. వారి వేధింపులు భరిస్తూ వచ్చిన యువతి చాకచక్యంగా పట్టుకుని దేహశుద్ధి చేసింది. వారిని వెంటపడి మరీ, ఎడాపెడా వాయించింది. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద జరిగింది.
గానుగుపహాడ్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రెండు రోజుల నుండి ఓ యువతి వెంటపడి వేధిస్తున్నారు. చిరు వ్యాపారం చేసుకునే ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మాటలతో, వెకిలి చేష్టలతో వేధించారు. దీంతో శివమెత్తిన యువతి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చిక్కకపోవడంతో మాట్లాడదాం రమ్మంటూ మధ్యవర్తులతో పిలిపించింది. బతుకమ్మ కుంట వద్దకు చేరుకోగానే ఆ యువతితో సహా కుటుంబ సభ్యులు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు.
అతగాడిని పట్టుకుని ఎడా పెడా వాయించారు. దేహశుద్ధి చేశారు. చివరికి జరిగి దానికి క్షమాపణ చెప్పడంతో శాంతించిన యువతి కుటుంబసభ్యులు వదిలేశారు
Also Read
- Kadapa: ఏడ్చుకుంటూ పరుగున పోలీస్స్టేషన్కు వచ్చిన చిన్నారి.. ఏంటని ఆరా తీయగా
- Andhra: భర్త చేసిన అప్పు.. కట్ చేస్తే.. ఆపై మహిళను చెట్టుకు కట్టేసి.. చెంపదెబ్బలు కొట్టి..
- AP Crime : అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి….చంద్రబాబు సీరియస్
- నేటి జాతకములు 17 జూన్, 2025
- పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?