July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

సూర్యాపేట  ఎట్టకేలకు తెగిన పంచాయితీ.. రూ. 2 ల‌క్ష‌లు ఇచ్చాకే త‌ల్లికి త‌ల‌కొరివి పెట్టిన కుమారుడు




  సూర్యాపేట  తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరికి అలాంటి తల్లిదండ్రులని పట్టించుకోని దీన స్థితి నెలకొంది. బంగారం, డబ్బుల కోసం చివరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు నిర్వ‌హించ‌కుండా రెండు రోజులు రోజులు ఆపి ఘ‌టన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులవారి గూడెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది


సూర్యాపేట  నేరేడుచర్ల : మానవత్వం మంట కలిసిపోతుంది. మానవ సంబంధాలు, విలువలు రోజురోజుకు దిగజారుతూ అంతరించిపోతున్నాయి. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఒకప్పుడు ప్రేమానురాగాలు ఉండేవి. రాను రాను డబ్బుపై వ్యామోహం పెరిగి బంధుత్వాలు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఆస్తి పాస్తులు ఉంటే చాలు తల్లిదండ్రులు కూడా అవసరం లేదని రుజువు చేస్తున్న ఘ‌ట‌న‌లు చూస్తున్నాం. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరికి అలాంటి తల్లిదండ్రులని పట్టించుకోని దీన స్థితి నెలకొంది. బంగారం, డబ్బుల కోసం చివరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు నిర్వ‌హించ‌కుండా రెండు రోజులు రోజులు ఆపి ఘ‌టన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులవారి గూడెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


కందులవారిగూడేనికి చెందిన వేము వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. గతంలోనే లక్ష్మమ్మ భర్త వెంకటరెడ్డి, చిన్న కుమారుడు కూడా చనిపోయారు . దీంతో నేరేడుచర్లలో ఉంటున్న చిన్న కుమార్తె వద్ద గత ఐదేళ్లుగా ల‌క్ష్మ‌మ్మ‌ ఉంటుంది. లక్ష్మమ్మ ఇటీవల కాలు జారి కింద‌ పడింది. దాంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు . ఆమె పరిస్థితి విషమించ‌డంతో ఇంటికి తీసుకెళ్లండని డాక్ట‌ర్లు సూచించారు.

దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్ స‌పోర్ట్‌తో చిన్నకుమార్తె తన ఇంటికి తీసుకెళ్లింది. బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ వ‌చ్చి ఆగింది. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకుని.. పెద్దమనుషులతో పంచాయితీ పెట్టించారు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తానని చెప్పడంతో.. మిగతా కూతుళ్లు ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుపట్టారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు.

మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించినా కొడుకు కూతుళ్ల పంచాయితీ మాత్రం ఆగలేదు. లక్ష్మమ్మ గతంలో రూ.21 లక్షల వరకు పలువురికి అప్పులిచ్చారు. ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. అయితే లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్నకూతురికి రూ.21 లక్షల్లోంచి రూ.6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన రూ.15 లక్షలకు సంబంధించిన పేపర్లను కుమారుడికి అప్పజెప్పారు. 20 తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు. అంతా అయిపోయిందిలే అనుకుంటున్నా సమయంలోనే కుమారుడు కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానన్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రెండు లక్షలు ఇప్పియడంతో ఆ పంచాయితీ కొలిక్కి వచ్చింది. తర్వాత ఆమె అంత్యక్రియల‌ను నిర్వ‌హించారు

Also read

Related posts

Share via