SGSTV NEWS
CrimeTelangana

Nalgonda: ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటూ మాయమైన బాలుడు.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా



నల్లగొండకు చెందిన అహ్మద్, షమీమున్నిసా బేగం దంపతులు కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల అబూ అనే బాలుడు ఉన్నాడు. చిన్నచిన్న కూలి పనులు చేస్తూ.. ప్రభుత్వం అందించే ఐదు రూపాయల భోజనంతో పూట గడుపుకుంటున్నారు. ఆ వివరాలు..

ఇటీవల పిల్లల కిడ్నాప్‌లు ఎక్కువైపోయాయి. తరచూ ఎక్కడో అక్కడ చిన్నారులు కిడ్నాప్‌లకు గురవుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. మార్చి 4న మధ్యాహ్న సమయంలో ఆస్పత్రి ఆవరణలోకి ఫోన్‌ మాట్లాడుకుంటూ వచ్చిన ఓ దుండగుడు.. ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటున్న మూడేండ్ల బాలుడిని ఎత్తుకెళ్లాడు.

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నల్లగొండకు చెందిన అహ్మద్, షమీమున్నిసా బేగం దంపతులు కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల అబూ అనే బాలుడు ఉన్నాడు. చిన్నచిన్న కూలీ పనులు చేస్తూ.. ప్రభుత్వం అందించే ఐదు రూపాయల భోజనంతో పూట గడుపుకుంటున్నారు. ఈనెల 4వ తేదీన ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ప్రాంతంలో అబూ ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు.. హాస్పిటల్ ఆవరణలో వెతికినా.. ఆచూకీ లభించలేదు.

వెంటనే బాలుడు తల్లిదండ్రులు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. హాస్పిటల్ ఆవరణలోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ ఫుటేజీలో నాలుగవ తేదీ మధ్యాహ్నం సమయంలో ఫోన్ మాట్లాడుకుంటూ హాస్పిటల్ ఆవరణలోకి ఓ దుండగుడు వచ్చాడు. అక్కడే ఆడుకుంటున్న అబూను ఎత్తుకెళ్లినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. దీంతో ఆ దుండగుడుని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో దుండగుడిని పట్టుకొని బాలుడిని క్షేమంగా తీసుకువస్తామని పోలీసులు చెబుతున్నారు

Also read

Related posts

Share this