నిడదవోలు మండలం పెండ్యాల లో ఐ.యఫ్.టి.యు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ వాకా సత్యనారాయణ, కార్యదర్శి కారింకి రమేష్ లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు తమ జీవనోపాధి నిలుపుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ప్రభుత్వం నుంచి తమకు ఏవిధమైన సహాయ, సహకారాలు అందడం లేదన్నారు.
ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డు లు పొంది దశాబ్దాలుగా వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందేవారనీ, కార్మికులు తమ ఆధార్ ద్వారా రేషన్, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ వంటి వివిధ ప్రభుత్వ పధకాలను పొందగలుగుతున్న కార్మికులు కార్మిక శాఖ లోని సాంకేతిక లోపాల కారణంగా ఆధార్ లో లోపం వుందంటూ గుర్తింపు కార్డు ల జారీ నిలిచి పోయిందని, ఫలితంగా తమ ఆర్థిక పరిహారాలకోసం దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈవిధంగా వ్యవహరిస్తోందని, తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, లోపాలు సరిచేసి, గుర్తింపు కార్డు ల జారీ చేయాలని డిమాండ్ చేశారు.
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు వాకా రాంబాబు, ప్రత్తి పాటి వెంకటేశ్వరరావు, సత్తిబాబు, మిద్దె రాంబాబు తదితరులు నాయకత్వం వహించారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే