నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తిరుపతి: నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రగిరి అభ్యర్థులు పులివర్తి నాని (తెదేపా), చెవిరెడ్డి మోహిత్రెడ్డి (వైకాపా) నామినేషన్ వేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా మోహిత్రెడ్డితో పాటు ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కార్యాలయానికి రాగా.. కొద్ది సేపటికి పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాదరావు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో మోహిత్రెడ్డి వెనుక ఉన్న కొందరు వైకాపా కార్యకర్తలు తెదేపా జెండాలను కింద వేసి తొక్కారు. దీనిపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. సమీపంలో మురుగుకాల్వ కల్వర్టు నిర్మాణానికి ఉంచిన కంకర రాళ్లను విసిరారు. తెదేపా కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాదాపు రెండుగంటల పాటు ఘర్షణ జరిగింది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ, ప్రదర్శనకు ఒకే సమయంలో పోలీసులు అనుమతివ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే