October 16, 2024
SGSTV NEWS
Andhra Pradesh

మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలి

*మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలి…*

అమరావతి:
గుంటూరు నగరంలోని *బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ* రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన మద్యం పాలసీ టెండర్లు, లాటరీల ప్రకారం ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభమయ్యే సందర్భంలో మద్యం షాపులకు వివిధ మతాలకు చెందిన దేవుళ్ళ పేర్ల తో బోర్డులు పెట్టనీయకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, ఎక్సైజ్ శాఖ మంత్రికి, కూటమి ప్రభుత్వానికి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన గతంలో 2014 -2019 వరకు వున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లు పెట్టకూడదని జీవో ఇచ్చారని, అదే జీవోను ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, తద్వారా వివిధ మతాల భక్తుల మనోభావాలను, ఆధ్యాత్మికత గౌరవాన్ని చాటిచెప్పేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. దేవుళ్ళ పేరుతో ఈ అపచార కార్యక్రమం జరక్కుండా చర్యలు తీసుకోవాలని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినప్పటికీ ఆయా మద్యం షాపులకు దేవుళ్ళ పేర్ల బోర్డ్లు తగిలించకుండా మద్యం వ్యాపారం చేసుకునేలాగా కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వివిధ మతాలకు చెందిన దేవుళ్ళ యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిని కూటమి ప్రభుత్వానికి ఆధ్యాత్మిక భక్తుల్లో చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉందని శ్రీధర్ హెచ్చరించారు. వివిధ మతాల ప్రార్ధనాలయాలు, ప్రార్థన స్థలాల, పాఠశాలలు, కళాశాలల వద్ద షాపులు ఏర్పాటు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దానితోపాటు దేవుళ్ళు, స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులు పేర్లు లేకుండా, కేవలం ఫ్యాన్సీ పేర్లతోనే మద్యం షాపులకు పెట్టాల్సిన పేర్లపై గత జీవో కొనసాగించేలాగా కానీ లేదా కొత్త జీవో ఇచ్చే విధంగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

Also read

Related posts

Share via