ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయ ప్రాంగణంలోని మల్లికా గుండంలో చండీశ్వరునికి అవబృద స్నానం, త్రిశూల స్నానం క్రతువులు జరిపారు.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ,అమ్మవార్లకు అశ్వవాహన సేవ నిర్వహించారు.ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను ఆసీనులను చేయించారు. ఆలయ అర్చకులు,వేద పండితులు ప్రత్యేక అలంకరణ, పూజాదికాలు నిర్వహించి హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబా దేవి నిజరూపంలో దర్శనమిచ్చారు. అష్ట భుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు ,గద, ఖడ్గం, విల్లు ,డాలు, పరిగ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చారు. అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్నీ తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయిని శాస్త్రాలు చెబుతున్నాయి. అశ్వవాహనాదీసులైన స్వామి అమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తొలగుతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని పండితులు పేర్కొన్నారు.
Also read
- Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
- Navagrahas: నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్లు కడుక్కోవాలా?.. ఈ పొరపాట్లు చేయకండి..
- Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!
- నేటి జాతకములు..2 జూలై, 2025
- చెత్త లారీలో మృతదేహం.. వీడిన మిస్టరీ! షంషుద్దీన్తో ఏడాదిన్నరగా వివాహేతర బంధం.. ఆ తర్వాత