ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయ ప్రాంగణంలోని మల్లికా గుండంలో చండీశ్వరునికి అవబృద స్నానం, త్రిశూల స్నానం క్రతువులు జరిపారు.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ,అమ్మవార్లకు అశ్వవాహన సేవ నిర్వహించారు.ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అశ్వవాహనంపై ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను ఆసీనులను చేయించారు. ఆలయ అర్చకులు,వేద పండితులు ప్రత్యేక అలంకరణ, పూజాదికాలు నిర్వహించి హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబా దేవి నిజరూపంలో దర్శనమిచ్చారు. అష్ట భుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు ,గద, ఖడ్గం, విల్లు ,డాలు, పరిగ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చారు. అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్నీ తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయిని శాస్త్రాలు చెబుతున్నాయి. అశ్వవాహనాదీసులైన స్వామి అమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తొలగుతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని పండితులు పేర్కొన్నారు.
Also read
- Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి వారఫలాలు
- జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో ఏకంగా 3 ప్రదోషాలు..! తేదీలు, శుభ సమయం
- హోలికా ఎవరు…? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే అసలైన హోలీ..!
- నేటి జాతకములు..1 మార్చి, 2026
- షాపింగ్ మాల్లో సీక్రెట్ ప్లాన్ ఫెయిల్… జీడిపప్పు కేసులో మహిళల అరెస్ట్





