ఒంగోలు::
ఫాల్గుణ మాసం చతుర్దశి, పౌర్ణమి తిధులైన మార్చ్ 24, 25 తేదీలలో శ్రీ రాధా మాధవ కళ్యాణం సాంప్రదాయ భజన పద్ధతిలో స్థానిక దేవుని మాన్యం, ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు శ్రీ రాధాకృష్ణ ఆశ్రమం నిర్వాహకులు బ్రహ్మచారి వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు వివరాలు తెలుచూ… 24వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి గణపతి పూజ, కలశ స్థాపన, తోడై మంగళం, జయదేవ అష్టపదులు, పంచపది, దివ్య నామం, దీప ప్రదక్షిణ మరియు డోలోత్సవం జరుగునని, 25వ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉంచ వృత్తి, తదుపరి శ్రీ రాధా మాధవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ లోకనాధుని కళ్యాణానికి భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తదుపరి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరారు.
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..