SGSTV NEWS
Hindu Temple History

సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం



తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణంలో ఉన్న సువర్చల సహిత ఆంజనేయస్వామి ఆలయం అత్యంత ప్రత్యేకమైనది. 2006లో నిర్మించబడిన ఈ ఆలయంలో, ఆంజనేయస్వామికి భార్య సువర్చలగా పూజలు జరుగుతాయి. సూర్యపుత్రిక సువర్చలను ఆంజనేయస్వామి వివాహం చేసుకున్న కథ ఆలయ పురోహితులు వివరించారు.




ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సువర్చల సహిత ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందులో మాత్రమే ఉండడం విశేషం. సువర్చల సహిత ఆంజనేయస్వామి ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆలయం లేదు. ఆంజనేయ స్వామికి భార్య ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు. అయితే ఇలాంటి ఒక ఆలయం ఉందని తెలుసుకున్న కొంతమంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు వీఐపీలు ఇక్కడికి వచ్చి సతీసమేతంగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారు.

ఆంజనేయ స్వామికి భార్య ఎలా వచ్చింది..?
అసలు ఆంజనేయ స్వామికి భార్య ఎలా వచ్చిందనే విషయం ఆ ఆలయ పురోహితుడు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 2006లో ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. ఆంజనేయ స్వామికి భార్య సూర్యుని పుత్రిక సువర్చల. సూర్య దేవుని వద్ద విద్య నేర్చుకోవడం కోసం తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సి ఉండగా తన కూతురినే ఇచ్చి 33 కోట్ల మంది దేవతల సమక్షంలో ఆంజనేయ స్వామికి పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ తరువాత విద్య నేర్చుకొని తపస్సుకు వెళ్లిపోతారు. అప్పటినుండి సువర్చల సహిత ఆంజనేయస్వామిగా పిలవబడుతున్నాడు. ఈ గుడికి వివిధ రాష్ట్రాలు నుండి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అని తెలియజేశారు

Also read

Related posts

Share this