మన జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ తొమ్మిది గ్రహాలు కేవలం ఆకాశంలో ఉండే కాంతిపుంజాలు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి జీవితాన్ని, శరీరాన్ని, మనస్సును ప్రభావితం చేసే శక్తులుగా పరిగణిస్తారు. జాతకంలో ఈ గ్రహాల స్థానాన్ని బట్టి వ్యక్తి జీవిత గమనం, కష్టసుఖాలు ఆధారపడి ఉంటాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. అసలు ఈ నవగ్రహాలు ఏమిటి? అవి మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వాటి దోషాలను నివారించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మన జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి ఆ జాతకుడికి కలిగే ఫలితాలు ఆధారపడి ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ తొమ్మిది గ్రహాలను నవగ్రహాలు అని పిలుస్తారు. ఈ తొమ్మిది గ్రహాలు మానవుల జీవితాన్ని నిర్దేశించే శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. ప్రతి ఒక్కరి శరీరం, మనస్సును నవగ్రహాలే నడిపిస్తాయి.
నవగ్రహాల ప్రభావం:
సూర్యుడు మన ఆత్మను నడిపిస్తాడు.
చంద్రుడు మనస్సును నియంత్రిస్తాడు.
కుజుడు, రాహువు మనకు బలాన్ని ఇస్తాయి.
బుధుడు వాక్పటిమను మెరుగుపరుస్తాడు.
గురువు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.
శుక్రుడు కామ కోరికలను, ఇంద్రియాలను నడిపిస్తాడు.
శని దుఃఖం, నరాల సమస్యలు మరణాన్ని నిర్ణయిస్తాడు.
కేతువు కూడా రాహువుతో కలిసి మన జీవితాలపై ప్రభావం చూపుతుంది.
గ్రహ దోషాలు, పరిహారాలు:
ఈ గ్రహాలలో ఏదైనా గ్రహ దోషం ఏర్పడితే, ఆ గ్రహానికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలు లభించవు. అంతేకాకుండా, గ్రహాల సంచారం వల్ల మంచివి జరగవచ్చు లేదా చెడు ఫలితాలు కూడా సంభవించవచ్చు. జాతకంలో ముఖ్యమైన గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి ఆ జాతకుడికి సంబంధించిన ఫలితాలు ఉంటాయి. కాబట్టి, గ్రహ స్థితికి అనుగుణంగా జీవితాన్ని ప్రశాంతంగా, సుసంపన్నంగా మార్చుకోవాలంటే, ఆయా గ్రహాలకు సంబంధించిన ఆలయాలను సందర్శించి, పరిహారాలు చేసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
