గత ప్రభుత్వంలో తనపై 18 కేసులు పెట్టారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు.
నెల్లూరు: గత ప్రభుత్వంలో తనపై 18 కేసులు పెట్టారని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) విమర్శించారు. నెల్లూరులోని రైల్వే కోర్టుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. సంబంధం లేని కేసులో నిందితుడిగా కోర్టుకు హాజరైనట్లు తెలిపారు.
రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడని ఆరోపించారు. కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు సంపాదించి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
“వెన్నుపోటు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ కు లేదు. కానిస్టేబుల్ను చంపబోయిన రౌడీషీటర్ను ఆయన పరామర్శించారు. జూన్ 4న రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చింది.. ప్రజాస్వామ్యం బతికిన రోజు” అని సోమిరెడ్డి -. పేర్కొన్నారు
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





