గత ప్రభుత్వంలో తనపై 18 కేసులు పెట్టారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు.
నెల్లూరు: గత ప్రభుత్వంలో తనపై 18 కేసులు పెట్టారని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) విమర్శించారు. నెల్లూరులోని రైల్వే కోర్టుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. సంబంధం లేని కేసులో నిందితుడిగా కోర్టుకు హాజరైనట్లు తెలిపారు.
రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడని ఆరోపించారు. కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు సంపాదించి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
“వెన్నుపోటు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ కు లేదు. కానిస్టేబుల్ను చంపబోయిన రౌడీషీటర్ను ఆయన పరామర్శించారు. జూన్ 4న రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చింది.. ప్రజాస్వామ్యం బతికిన రోజు” అని సోమిరెడ్డి -. పేర్కొన్నారు
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..





నాకు, జగన్కు మధ్య విభేదాలు సృష్టించారు… మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు