July 3, 2024
SGSTV NEWS
CrimeNational

ఆమెకి ఇద్దరు భర్తలు! ఈ గ్యాప్‌లో ఇంట్లో ఒంటరిగా ఉండటంతో!

పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని మనువాడింది. అతడితో మనస్పర్థలు రావడంతో వదిలేసి.. పుట్టింటికి చేరింది. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొడుకుతో, తల్లితో ఉంటుంది. అంతలో..

పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది వసంత. వీరికి ఓ బాబు జన్మించాడు. కానీ అతడితో ఎక్కువ కాలం కాపురం చేయలేకపోయింది. భర్తతో కొట్లాడి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తుంది. చిన్న చితకా పనులు చేసుకుంటూ.. అటు తల్లిని, ఇటు కుమారుడ్ని పోషిస్తుంది. కూతురు ఒంటరిగా ఉండటం చూసిన తల్లి.. మరో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. దీంతో కాదనలేక.. మరో వ్యక్తిని మనువాడింది. కొన్నాళ్ల పాటు హాయిగా జీవితం సాగిపోతుంది. అంతలో వసంత, ఆమె తల్లి, కొడుకు విగత జీవులుగా కనిపించారు. ఈ ముగ్గురు మృతదేహాలు ఇంట్లో కనిపించాయి. ఆమె సోదరి,  ఇరుగు పొరుగు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


రెండో పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకే వసంత, ఆమె తల్లి, కొడుకు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వసంత ప్రస్తుతం హోసలింగపుర గ్రామంలో తల్లి రాజేశ్వరి, కొడుకు సాయి ధర్మతేజతో కలిసి ఉంటుంది. గతంలో ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలకు చెందిన వ్యక్తితో  వివాహమైంది. వీరికి ఓ బాబు జన్మించాడు. కానీ, రెండేళ్ల క్రితం వసంత భర్తను విడిచిపెట్టి తల్లి స్వగ్రామమైన లింగాపూర్‌ వచ్చేసింది. హోసలింగపుర గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆమె న్యూ సింగపూర్ సమీపంలోని ఒక తోలు బొమ్మల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. తనకు వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఆమె కష్టాన్ని చూసిన తల్లి చలించిపోయింది.

కొడుకు చిన్నవాడు కావడంతో పాటు వసంతకు పెద్ద వయస్సు లేకపోవడంతో మరో పెళ్లి చేసుకోవాలంటూ తల్లి ఒత్తిడి తెచ్చింది. అయితే అందుకు అంగీకరించిన ఆమె..మరో మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంతా సవ్యంగా సాగిపోతున్నందుకున్న సమయంలో వసంత, రాజేశ్వరి, ధర్మతేజ ఇంట్లో శవాలై కనిపించారు. వసంత సోదరి తల్లి రాజేశ్వరికి ఫోన్ చేసింది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి నేరుగా వచ్చి.. చూడగా ముగ్గురు చనిపోయి కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పడక గదిలో అమ్మమ్మ, మనవడి మృతదేహాలు లభ్యమయ్యాయి. వంటగదిలో వసంత మృతదేహం లభించింది. అయితే మృతికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఇది సహజ మరణమా లేక హత్యా అనేది తెలియాల్సి ఉంది. అనూమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కొందరు దుండగులు ముగ్గురిని హత్య చేసి పరారైనట్లు అనుమానిస్తున్నారు

Also read

Related posts

Share via