ఏపీ మాజీ సీఎం జగన్ తమ తల్లి విజయమ్మను మోసం చేస్తున్నాడని వైఎస్ షర్మిల అన్నారు. ఒక్క ఆస్తి తనకు ఇవ్వలేదని మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగానే కాదు మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు.
YS షర్మిల: ఏపీ మా జీ సీఎం జగన్ తమ తల్లి విజయమ్మను మోసం చేస్తున్నాడని వైఎస్ షర్మిల అన్నారు. ఒక్క ఆస్తి తనకు ఇవ్వలేదని మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగానే కాదు మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు.
ఆ షేర్లు గిఫ్ట్డీడ్..
ఈ మేరకు సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై స్వయంగా సంతకం చేసిన జగన్.. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని అన్నారు. విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్డీడ్ కింద ఇచ్చారు. ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని కోర్టుకు వెళ్లారు. తల్లినే మోసం చేస్తున్నారు. తల్లిపై కేసు వేసిన కొడుకు, మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ మండిపడ్డారు. జగన్కు విశ్వసనీయత ఉందో లేదో ఆ పార్టీ నేతలే ఆలోచించాలన్నారు.
ఇక ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై కూడా విమర్శలు గుప్పించారు షర్మిల. గతంలోనే వచ్చి మన మోహన మట్టి కొట్టి పోయారన్నారు. మోదీ అమరావతికి రావడం ఇదేమి మొదటిసారి కాదు. మళ్లీ వచ్చిన ఒరిగేది ఏమీ లేదు. ఈసారి మళ్లీ వచ్చి సున్నం కొట్టి పోతారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. ఆంధ్ర ప్రజలు బతుకులు బాగుపడాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆమె అన్నారు. ఇక రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం దేశానికి ఎంత ఉపయోగమో తెలీదు.. రాష్ట్రానికి మాత్రం చాలా ఉపయోగం. నేను పీసీసీ చీప్ గా ఉన్నది అస్తమానం జగన్ ను బీట్ చెయ్యడానికి కాదు. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటానికే అన్నారు.
అలాగే విభజన హక్కులు సాధించడంలో వైసీపీ, టీడీపీ విఫలం అయ్యాయని అన్నారు. ముఖ్యమైన ప్రత్యేక హోదా, పోలవరం సహా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. 11 ఏళ్ళు గడిచినా కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్కటికూడా అమలు చేయలేదు. ఆంధ్ర ప్రజల్ని మోసం చేసిన మోడీని కేడీ అంటే తప్పేంటి? ఈ హామీలపై చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. ysr హయాంలో పోలవరంకు అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. 10,150 కోట్లతో 190 టీఎంసీ కెపాసిటీతో 45.7 మీటర్ల ఎత్తుతో నిర్మాణం మొదలుపెట్టారు. 45.7 స్టోరేజ్ కెపాసిటీ తో కడితేనే ప్రాజెక్టు రాష్ట్రానికి వరం. ఎత్తు తగ్గిస్తే పోలవరం రాష్ట్రానికి వరం కాదు. ysr ఉనప్పుడు 33 శాతం పనులు పూర్తి చేసారు. తరువాత చంద్రబాబు 15 శాతం పనులు చేసారు. జగన్ సీఎం అయ్యేసరికి 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. ysr కు పోలవరం ఎంత ప్రాధాన్యత ఎంతో తెలిసి కూడా జగన్ పట్టించుకోలేదు. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు కేలవం 3 శాతం మాత్రమే చేసారు. ఇప్పుడు కేంద్రం ప్రాజెక్టు 41.15 మీటర్లు ఎత్తుకి తగ్గిస్తుంటే వీళ్ళు ఎవరూ మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు
ఎత్తు తగ్గించడం ద్వారా కాస్ట్ తగ్గించాలని కేంద్రం చూస్తుంది. 85 వేల నిర్వాసితులను తగ్గించడానికి ఎత్తు తగ్గించేస్తున్నారు.
చంద్రబాబు, జగన్ ఇద్దరూ బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారారు. రాష్ట్రానికి కేంద్రం మోసం చేస్తుంటే వైసీపీ టీడీపీ జనసేన ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. 41.15 మీటర్ల ఎత్తుకి తగ్గిస్తే పోలవరం కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవుతుంది. 41.15 మీటర్లకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటే 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలరా..? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారు చెప్పండి. పోలవరం పై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయండి. ప్రత్యేక హోదా గొంతు పిసికి చంపేసినట్టు పోలవరం ప్రాజెక్టును చంపే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.
Also read
- నేటి జాతకములు…23 మే, 2025
- Garuda Puran: గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకున్న జీవికి వేసే శిక్షలు తెలిస్తే.. సూసైడ్ అన్న మాటే తలవరు
- శుభకార్యం ఆనందం తీరకముందే అంతులేని విషాదం.. ఒకరిని రక్షించబోయి మరొకరు..
- జమ్మూకశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం
- Andhra: ఫుల్లుగా తాగి.. ఛీ ఛీ ఏంట్రా ఇది..! ఆటోకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్పై దాడి…..