SGSTV NEWS
CrimeTelangana

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. కన్నతండ్రే ఆరేళ్ల బాలికను – చెమటలు పట్టిస్తున్న….

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. సదాశివపేటలోని ఓ బీరువాల తయారీ ఫ్యాక్టరీలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఆ ఫ్యాక్టరీలో నిధి ఉందన్న సమాచారంతో ఒక వ్యక్తి తన ఆరేళ్ల కూతురిని బలివ్వబోయాడు. సమయానికి పోలీసులు వచ్చి దాన్ని ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది

Also read :…TG Crime : నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. సదాశివపేటలో క్షుద్ర పూజలు స్థానిక ప్రజలను భయ బ్రాంతులకు గురి చేశాయి. పట్టణంలోని బస్టాండ్ సమీపం వద్ద ఉన్న ఓ బీరువాల తయారీ ఫ్యాక్టరీలో ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు జరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు.

Also read:….అమ్మ ఫెయిల్‌ అయ్యా చచ్చిపోతున్నా.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

నిధుల కోసం ఆరేళ్ల బలికను
దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే గుప్తనిధుల కోసం ఆరేళ్ల బాలికను బలి ఇవ్వబోయారని స్థానికులు ఆందోళనకు దిగారు. కాగా ఈ క్షుద్రపూజలు చేయడానికి ఏకంగా అయోధ్య నుంచి ఓ స్వామీజీని ఇక్కడకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

Also readTG Crime: నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

బీరువాల ఫ్యాక్టరీలో నిధి ఉందని.. బాలికను బలిస్తే బంగారం దొరుకుతుందని ఓ స్వామీజీ ఒక వ్యక్తిని బాగా నమ్మించాడు. దీంతో ఆ వ్యక్తి భారీగా డబ్బుతో పాటు.. తన ఆరేళ్ల కూతురిని కూడా పూజల కోసం ఆ స్పాట్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పూజలు చేస్తున్న సమయంలో ఆ ఆరేళ్ల బాలికపై దుప్పటి కప్పి నిద్రపుచ్చారని స్థానికులు చెబుతున్నారు.

Also readAP Crime: తిరుపతిలో విషాదం.. దామల చెరువులో వ్యాపారి దారుణ హత్య

TG Crime: ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి

నాకు న్యాయం చేయండి.. ప్రియుడు ఇంటి ముందు హిజ్రా నిరసన దీక్ష

Related posts

Share this