నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో భారీ చోరీ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రూ.80 లక్షల చోరీ కేసు పోలీసులు ఛేదించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. రూ.66.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో భారీ చోరీ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రూ.80 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.66.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. విజయవాడ జగ్గయ్యపేట వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు.
హోటల్ మొదటి అంతస్తులోని గది తలుపులు, లాకర్ పగులగొట్టి ఉండటంతో నిర్వాహకులు ఇటీవల పోలీసులకు సమాచారం అందించారు. సుమారు రూ.80 లక్షల నగదు దొంగలించినట్లు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తాజాగా నిందితులను పట్టుకున్నారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!