నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో కొంత భాగం తనది కాదని రెవెన్యూ అధికారులు చెబుతుండటంతో రైతు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఆత్మకూరు, : నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో కొంత భాగం తనది కాదని రెవెన్యూ అధికారులు చెబుతుండటంతో రైతు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నువ్వూరుపాడులో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం… నువ్వూరుపాడు పంచాయతీ పాత జంగాలపల్లిలో ఎస్సీ కాలనీకి చెందిన రైతు కత్తి పుల్లయ్య(55) రెండున్నర ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. భూమికి సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయి. రెండేళ్ల క్రితం అధికారులు రీసర్వే చేసి… రెండెకరాలే ఉందని చెప్పారు. మిగిలిన అరెకరం పక్కవారిదని, వారికి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. అప్పటి నుంచి పుల్లయ్య అధికారుల చుట్టూ తిరుగుతూ తన గోడు వినిపించారు. గత నెలలో నువ్వూరుపాడులో పర్యటించిన కలెక్టర్ ఆనంద్కు సమస్యను విన్నవించారు. వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. మళ్లీ సర్వే చేస్తామంటూ పుల్లయ్యకు అధికారులు మంగళవారం సమాచారమిచ్చారు. సర్వే చేసినా నీకు దక్కేది రెండెకరాలే అని కొందరు ఆయనతో చెప్పారు. దీంతో మానసికంగా వేదనకు గురైన పుల్లయ్య… ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





