శ్రీకాళహస్తి :కొలకత్తా మెడికో విద్యార్థి ఘటనపై దేశమంతా అట్టుడుకుతున్న వేళ శ్రీకాళహస్తిలో మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మైనర్ బాలికపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను గర్భవతి చేసి నిందితులు పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు… శ్రీకాళహస్తి బహదూర్ పేటకు చెందిన మైనర్ బాలిక చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోవడంతో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. నలుగురు యువకులు బాలికకు మాయమాటలు చొప్పి లోబరుచుకున్నారు. అత్యాచార విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో యువకులను మందలించి గ్రామ పెద్దలు రాజీ చేశారు. అయితే, బాలిక గర్భవతి అయిందన్న సంగతి తెలుసుకున్న అమ్మమ్మ గురువారం రాత్రి శ్రీకాళహస్తి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు మధు, సునీల్, చంద్రతో పాటు తిరుపతికి చెందిన మరో యువకుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..