రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్రప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు, చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారు. అయితే ఆయన చివరికి గెలిచే వెళ్లారు. అనుకున్నది సాధించి మరీ వెళ్లారు. ప్రపంచం బతుకున్నంత వరకు రామోజీ ఉంటారు’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





