భార్యాభర్తల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానై భర్త హత్యకు దారితీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
నిడదవోలు : భార్యాభర్తల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానై భర్త హత్యకు దారితీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని రెడ్డి చెరువు గ్రామానికి చెందిన చింతలపూడి శ్రీనివాసరావు, రాణి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో రాణి తన భర్త శ్రీనివాసరావు గుండెలపై కత్తెరతో పొడిచింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును అతని తమ్ముడు తణుకులోని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు. మృతుడి అన్న గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, నిందితురాలిని అరెస్ట్ చేస్తామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..