గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది
నెన్నెల, : గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. నెన్నెల ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన అబ్బర్ల విజయ్, పద్మ దంపతులకు ముగ్గురు కుమారులు. ఇంటిలో ఉంటున్న ఇద్దరు కొడుకులు, తల్లిదండ్రులు గుడుంబా మత్తులో నిత్యం గొడవ పడుతుంటారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విజయ్, పద్మ దంపతులు రెండో కొడుకు అశోక్ను గుడుంబా కోసం డబ్బులడగ్గా ఇవ్వకపోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వారు గుడుంబా తాగి ఆ మత్తులో.. మంచంపై నిద్రిస్తున్న పెద్ద కుమారుడు శేఖర్ను అశోక్ అనుకుని కొడవలితో ఛాతీపై కోశారు. తీవ్ర గాయాలపాలైన శేఖర్ ప్రస్తుతం మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Also read :రాష్ట్రానికి రాలేననుకున్నా – మంత్రి లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చా: గల్ఫ్ బాధితుడు వీరేంద్ర*
Nellore: విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
Tirupati: ఈ దంపతులిద్దరూ దేశముదుర్లు.. యువతికి గంజాయి అలవాటు చేసి.. ఆపై
పాతబస్తీలో మహిళలను జుగుప్సాకరంగా తాకుతూ వికృత చేష్టలు.. నిందితుడిని వెంటాడిన స్థానికులు
Andhra Pradesh: చూడ్డానికి జెంటిల్ మెన్లా ఉన్నాడనుకుంటే పొరపాటే.. ఏం చేశాడో తెలిస్తే మైండ్ బ్లాంకే
Cyber Fraud: ఫోన్లోనే సంప్రదింపులు.. ఆన్లైన్లో నియామకాలు.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు..!