పల్నాడు జిల్లా ఈపూరు మండలం బద్రుపాలెం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి .. బతికుండగానే కన్న తండ్రిని కాలువలో పడేసిన ఘటన కలకలం రేపింది.
ఈపూరు: పల్నాడు జిల్లా ఈపూరు మండలం బద్రుపాలెం
వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బతికుండగానే కన్న తండ్రిని కాలువలో పడేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్లకు చెందిన గంగినేని వెంకటేశ్వర్లు తన తండ్రి కొండయ్య(85)ను కారులో తీసుకొచ్చి బద్రుపాలెం వంతెనపై నుంచి సాగర్ కాలువలో పడేశాడు.
ఈ ఘటన చూసిన గ్రామస్థులు వృద్ధుడిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారమందించారు. పోస్టుమార్టం నిమిత్తం కొండయ్య మృతదేహాన్ని వినుకొండ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ గ్రామీణ సీఐ ప్రభాకర్, ఈపూరు ఎస్సై ఉమా మహేశ్వర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Also read
- BRS : యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ నేత.. చితక్కొట్టిన భార్య
- TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”