సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి!
హైదరాబాద్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్లో మరమ్మత్తు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
