SGSTV NEWS
Andhra Pradesh

నిడదవోలు  బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం.. అద్యక్షునిగ శివావధాని(శివాజీ )


బ్రాహ్మణ సంఘం, నిడదవోలు.
       ఈరోజు జరిగిన బ్రాహ్మణ సంఘ  సమావేశము కొత్త అద్యక్షులు శ్రీమునగాల శివావధాని గారి అద్యక్షతన క్రొత్త పాలకవర్గ సభ్యులను సభకు పరిచయము చేయుట జరిగినది.
    తదుపరి సభ్యత్వ రుసుము ప్రతి ఒక్క సభ్యునకూ రూ.120/-వసూలు చేయు కార్యక్రమము ప్రప్రధమముగా శ్రీ నడిపల్లి ఆంజనేయులుగారిచే ప్రారంభించుట జరిగినది.
    తదుపరి ది. 17/11/2024న జరగబోవు వనసమారాధన గూర్చిన సమాలోచన, దానిలోభాగంగా భాండశుధ్ధి కొరకు క్రొత్త వంటపాత్రలు బ్రాహ్మణ సంఘమే శాశ్వతముగా కొనుటకు నిర్ణయించుట జరిగినది. అందునిమిత్తం శ్రీ  పత్తనంక సురేంద్ర కుమార్ గారూ మరియు వారి సోదరులు రూ.10,000/-లు విరాళముగా ప్రకటించినారు. తదుపరి అద్యక్షులు శ్రీమునగాల శివావధానిగారు కూడా సంఘ అభివృద్ధి నిమిత్తం రూ.20,000/- విరాళము ప్రకటించినారు. అదేవిధముగా దాతలనుండి విరాళములు కోరుతూ సభ ముగింపు జరిగినది.
నూతన కార్యవర్గము:-
అద్యక్షులు:- శ్రీ మునగాల శివావధాని.
ఉపాద్యక్షలు:-శ్రీ పొన్నా సుబ్రహ్మణ్యం.
కార్యదర్శి:- శ్రీ కందికొండ లోకభాస్కరరావు.
సహాయకార్యదర్శులు:- శ్రీ పెనుగొండ గాంధీ, శ్రీ నేదునూరి రమేష్,  శ్రీ మైలవరపు కామేశ్వర ప్రసాద్.
కోశాధికారి:- శ్రీ పత్తనంక సురేంద్ర కుమార్.
న్యాయ సలహాదారులు:- శ్రీ నిడమర్తి భాస్కర రావు, శ్రీ నిడమర్తి రామచంద్రరావు.
సాంకేతిక సలహాదారులు:- శ్రీబలిజేపల్లి సాయి గౌతమ్, తుట్టగుంట దీపక్.   
ఇట్లు  బ్రాహ్మణ సంఘం,నిడదవోలు.

Related posts

Share this