బ్రాహ్మణ సంఘం, నిడదవోలు.
ఈరోజు జరిగిన బ్రాహ్మణ సంఘ సమావేశము కొత్త అద్యక్షులు శ్రీమునగాల శివావధాని గారి అద్యక్షతన క్రొత్త పాలకవర్గ సభ్యులను సభకు పరిచయము చేయుట జరిగినది.
తదుపరి సభ్యత్వ రుసుము ప్రతి ఒక్క సభ్యునకూ రూ.120/-వసూలు చేయు కార్యక్రమము ప్రప్రధమముగా శ్రీ నడిపల్లి ఆంజనేయులుగారిచే ప్రారంభించుట జరిగినది.
తదుపరి ది. 17/11/2024న జరగబోవు వనసమారాధన గూర్చిన సమాలోచన, దానిలోభాగంగా భాండశుధ్ధి కొరకు క్రొత్త వంటపాత్రలు బ్రాహ్మణ సంఘమే శాశ్వతముగా కొనుటకు నిర్ణయించుట జరిగినది. అందునిమిత్తం శ్రీ పత్తనంక సురేంద్ర కుమార్ గారూ మరియు వారి సోదరులు రూ.10,000/-లు విరాళముగా ప్రకటించినారు. తదుపరి అద్యక్షులు శ్రీమునగాల శివావధానిగారు కూడా సంఘ అభివృద్ధి నిమిత్తం రూ.20,000/- విరాళము ప్రకటించినారు. అదేవిధముగా దాతలనుండి విరాళములు కోరుతూ సభ ముగింపు జరిగినది.
నూతన కార్యవర్గము:-
అద్యక్షులు:- శ్రీ మునగాల శివావధాని.
ఉపాద్యక్షలు:-శ్రీ పొన్నా సుబ్రహ్మణ్యం.
కార్యదర్శి:- శ్రీ కందికొండ లోకభాస్కరరావు.
సహాయకార్యదర్శులు:- శ్రీ పెనుగొండ గాంధీ, శ్రీ నేదునూరి రమేష్, శ్రీ మైలవరపు కామేశ్వర ప్రసాద్.
కోశాధికారి:- శ్రీ పత్తనంక సురేంద్ర కుమార్.
న్యాయ సలహాదారులు:- శ్రీ నిడమర్తి భాస్కర రావు, శ్రీ నిడమర్తి రామచంద్రరావు.
సాంకేతిక సలహాదారులు:- శ్రీబలిజేపల్లి సాయి గౌతమ్, తుట్టగుంట దీపక్.
ఇట్లు బ్రాహ్మణ సంఘం,నిడదవోలు.
