గూడూరు గ్రామీణం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించాడు. గూడూరు రూరల్ మండలం కందలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిత (35) బాలాయపల్లి మండలం గొట్టిగాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఈ క్రమంలో నిర్మానుష్య ప్రదేశంలో డ్రైవర్ ఆటో ఆపి హరితపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమె బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. గాయపడిన ఉపాధ్యాయురాలిని గూడూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Students protest | నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థుల నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్
- నడిరోడ్డుపై గొడవ.. కారు బానెట్పై ప్రత్యర్థి ఉండగానే..
- ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ
- నేటి జాతకము..13 ఫిబ్రవరి, 2026
- మహిళలు హనుమంతుడి పాదాలను తాకితే ఏమవుతుంది..? అసలు రహస్యం తెలిస్తే అవాక్కే..





