దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సమాచారం. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువుతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు.
ఊర్కొండ, న్యూస్టుడే: దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సమాచారం. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువుతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు. దైవదర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్టప్రాంతంలోకి వెళ్లగా.. అక్కడ మాటువేసి ఉన్న యువకులు ఆమెను అటకాయించారు. ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేశారు. యువతిని బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులుగా గుర్తించిన పోలీసులు.. వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..