ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ వీడింది. ఏలూరుకు చెందిన ప్రియురాలు (వివాహిత) లావణ్యనే రవిప్రసాద్ను బనియన్తో గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
MURDER: ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ వీడింది. ఏలూరుకు చెందిన ప్రియురాలు (వివాహిత) లావణ్యనే రవిప్రసాద్ను బనియన్తో గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. లావణ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు తెలిపారు.
అక్రమసంబంధం పెట్టుకోవడంతో..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా రాఘవాపురంకు చెందిన వివాహిత లావణ్య.. తన భర్త భర్త శ్రీనివాసరావుతో కలిసి రవిప్రసాద్ కట్టించిన బిల్డింగ్లో నివసిస్తోంది. ఈ క్రమంలోనే కొద్దికాలంగా రవిప్రసాద్తో అక్రమసంబంధం పెట్టుకోవడంతో శ్రీనివాస్ వదిలేశాడు. దీంతో ఖమ్మం నేతాజినగర్కు మకాం మార్చి రవిప్రసాద్తో లావణ్య సహజీవనం చేస్తోంది. అయితే తరుచూ మద్యం సేవిస్తూ లావణ్యను వేధించడం మొదలుపెట్టాడు రవిప్రసాద్.
ఏప్రిల్ 6న లావణ్యతో రవిప్రసాద్ మరోసారి ఘర్షణపడ్డాడు. ఈ వాగ్వాదంలో లావణ్య చేయి కొరికేశాడు. కోపంతో రగిలిపోయిన లావణ్య.. రవిప్రసాద్ బనియన్ను మెడకు బిగించగా ఊపిరాడక అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత మద్యం మత్తులో జారిపడగా తల గోడకు తగిలి చనిపోయాడని నమ్మించింది. రవిప్రసాద్ మృతిపై అతని కొడుకు పునీత్ సాయి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణలో రవిప్రసాద్ను చంపినట్లు లావణ్య అంగీకరించింది. ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే