రైతు సమస్యలు, నాటి పారుదల ప్రాజెక్ట్ లు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్దమా:
హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్,
రైతు సమస్యలు, నీటి పారుదల ప్రాజెక్ట్ లు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై చర్చించడానికి సిద్ధమా అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు *రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు* సవాల్ విసిరారు. సమయం, తేదీ, వేదిక ఏదో చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో మంగళవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, శంకర్, వంశీకృష్ణ, రాజేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మీడియాతో మాట్లాడారు. పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామన్న హరీష్ రావు వ్యాఖ్యలను *మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఖండించారు.
అసలు సినిమా ముందుందని,బీఆర్ఎస్ హాయంలో జరిగిన అవినీతిని బయటపెడతామని, మీ తప్పులన్నీ బయట పెట్టాక తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు._ _హరీష్ రావు సచివాలయాన్ని ముట్టడిస్తామని అంటున్నారని…గత పదేళ్లలో_ _రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారని_
_ఇప్పుడు చేసేదేం లేక సచివాలయం ముట్టడిస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు.
రాయలసీమకు నీళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లు అప్పగించి చూసారని, కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేదని… పాత ప్రాజెక్ట్ ల నిర్వహణను గాలికి వదిలేసారని ద్వజమెత్తారు. పది సంవత్సరాల్లో ఎప్పుడైనా పంట నష్టానికి పరిహారం ఇచ్చారా? ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమాను అమలు చేశారా ? అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు.
మీ అనాలోచిత నిర్ణయాల వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని, అసలు బీఆర్ఎస్ నాయకులకు రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి అన్నది మీరు కాదా? రైతులకు వరి వేయద్దని చెప్పి…. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో వరి వేసింది ఎవరో అందరికీ తెలిసిందే అన్ని చెప్పారు.
అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంట నష్టంపై సీయం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, పంట నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు.
నివేదిక రాగానే రైతులకు ఎకరానికి రూ. 10 వేల నష్ట పరిహానం చెల్లిస్తామని, వచ్చే వాన కాలం సీజన్ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. అన్నదాతల కష్టాలు, కడగండ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమేనని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగలేదని, గత పదేండ్లలో 6, 651 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మేడి గడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటు మీ పాపం కదా?, వర్షం కాలం సీజన్ లో అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ? మరి ప్రాజెక్ట్ ల్లో నీళ్లు ఎందుకు నింపలేకపోయారని నిలదీశారు. ప్రతీ నీటిని బొట్టును ఒడిసి పడితామని చెప్పి… సకాలంలో ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేదన్నారు. కట్టిన ప్రాజెక్ట్ లు కూడా కూలీ పోయే పరిస్థితులు ఉన్నాయని, పాలమూర్ – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆదరబాదరగా పాలమూర్ – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని, కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేకపోయారని, పాలమూర్ – రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారి ఉండేది కాదని, నీటిపారుదల ప్రాజెక్ట్ లే కాదు ఏ ఒక్క హామీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని వివరించారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి… చిప్ప చేతికి ఇచ్చి వెళ్ళిపోయారని, అయినా సీయం రేవంత్ రెడ్డి సారద్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పుతారని అన్నారు. ఉమ్మడి పాలమూర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు…sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు మండలం నాగర్ కర్నూల్ జిల్లా
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024