పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది.

అబ్దుల్లాపూర్మెట్: పాల ప్యాకెట్ కోసం కుమారుడితో
వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై చోటుచేసుకుంది. మృతుడిని ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ (35)గా గుర్తించారు. జీవనోపాధి కోసం పది రోజుల క్రితమే ఆయన కుటుంబం ఈ ప్రాంతానికి వచ్చింది. గురువారం ఉదయం కనక ప్రసాద్ తన రెండేళ్ల కుమారుడితో కలిసి పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హైవేపై అతడి బైకు విజయవాడ వైపు నుంచి వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ప్రసాద్ మృతిచెందారు. బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Also read
- ఉగాది పండుగని ఏయే రాష్ట్రాల వారు ఎలా జరుపుకుంటారో తెలుసా? స్పెషల్ వంటకాలేంటంటే..
- మరో ఇల్లాలి ప్రాణం తీసిన ఫైనాన్స్ ప్రతినిధుల వేధింపులు.. అనాథలుగా మారి చిన్నారులు!
- చేతిలో స్టెతస్కోప్, ఒంటి మీద డాక్టర్ కోటు.. పైకి చూసి ఏదో అనుకునేరు.. లోపల యవ్వారం.!
- అబ్బ ఏం స్కెచ్ వేశావ్రా.. సైలెంట్గా జారుకుందాం అనుకున్నాడు.. కట్చేస్తే..
- ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..





