రోజూ తాగుతున్నారు. చేతిలో ఎంత ఉంటే అంత ధర పెట్టి కొంటున్నారు. జేబుకు చిల్లు పడుతోంది.. కారణం ఏంటో ఆలస్యంగా తెలుసుకున్నారు మందు బాబులు. వేరే షాపుల కంటే ఇక్కడ మద్యం ధరలు అధికంగా ఉన్నాయని తెలుసుకుని వారితో వాగ్వాదానికి దిగారు. నిన్నటి వరకు ఒక ధర ఇప్పుడు సిండికేట్గా మారి.. అధిక ధరలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో నాలుగు బ్రాందీ షాపులను లూటీ చేశారు మందుబాబులు. దాడి చేసి బాటిల్లను ఎత్తుకెళ్లారు. సుమారు 50 లక్షల విలువచేసే మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లినట్లు షాపు యాజమాన్యులు అంటున్నారు. కొంతమంది మద్యం షాపులోకి వెళ్లి అధిక రేట్లకు అమ్ముతున్నారని షాపు యజమానులను నిలదీశారు. దీంతో షాప్ యజమానులకు మందుబాబులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అది చిలికి చిలికి గాలి వానలా మారి షాపులను లూటీ చేసే స్థితికి చేరింది. అందినకాడికి మద్యం బాటిళ్లను దోచుకొని వెళ్ళారు.
ఇదే అవకాశంగా అనుకుని అటుగా వెళ్ళే మహిళలు కూడా షాపులో ఉన్న మద్యం బాటిల్స్ను ఎత్తుకెళ్లారు. అయితే మద్యం షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన ఒక నేత ఆధీనంలో ఈ వైన్ షాపు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను ఇతర మద్యం వ్యాపారులతో కలిసి సిండికేట్గా మారి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ లోపు చాలా మంది మద్యం బాటిళ్లను బాక్సుల్లో ఎత్తుకెళ్లారు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024