భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.యఫ్.టి.యు) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం నిడదవోలు లో ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు కె.వి.రమణ అధ్యక్షతన నిర్వహించడమైనది.
జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల 4 కోడ్ లు గా మార్చి వేసిందనీ, రాష్ట్రంలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక అది ఏ ప్రభుత్వమైనా అంగన్వాడి ల సమ్మె విరమింప చేయడానికై జూన్ నెలలో వేతనం పెంపుద, చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పక్క దారి పట్టించిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిధులను తక్షణమే బోర్డు కు జమచేసి పెండింగ్ లో ఉన్న ఆర్థిక పరిహారాలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
పై సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఐ.యఫ్.టి.యు నాయకులు వీరి నాయుడు, మంగం అప్పారావు, నెహ్రూ, యస్.రామ్మోహన్, సి.హెచ్.రమేష్, నాగరాజు, పామర్తి సత్య నారాయణ, తీపర్తి వీర్రాజు, పి.నాగేశ్వర రావు, గడసఆల రాంబాబు, కాకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





