* ఏసీబీకి చిక్కిన ఎంఈవో
* రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్యండెడ్గా కూడేరు ఎంఈవో చంద్రశేఖర్
Bribe: ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. కూడేరు ఎంఈవో చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్యండెడ్గా పట్టుబడ్డాడు. అనంతపురం నగరంలోని బళ్ళారి బైపాస్ రోడ్లో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎంఈఓ పట్టుబడ్డాడు. కూడేరు ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గొట్కూరు సమీపంలో ఉన్న వెరీ డైన్ ఎ కాల్ ఇంటర్నేషనల్ స్కూల్ పై స్టూడెంట్ యూనియన్స్, మీడియాలో వస్తున్న వాటిపై డీఈవో దృష్టికి వెళ్లకుండా మేనేజ్ చేయడానికి స్కూల్ యాజమాన్యం నుంచి 2 లక్షల రూపాయలను ఎంఈవో డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే పాఠశాల యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. పాఠశాలకు చెందిన సాగర్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ అనంతపురం బైపాస్లోని ఎంజీ పెట్రోల్ బంకు వద్ద ఎంఈవో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్హౌస్లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్