ఖైరతాబాద్: మ్యారేజ్ బ్యూరో ముసుగులో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న వారిపై సెంట్రల్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్కు చెందిన అయేషా సిద్ధిఖీ షాదాన్ కాలేజ్ లేన్లో మ్యారేజ్ బ్యూరో పేరుతో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది.
వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తోందని తెలుసుకున్న టాస్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేసి ప్రధాన నిర్వాహకురాలితో పాటు విటులు బానోత్ వీరుడు, షేక్ సిహబ్, మహ్మద్ సులేమాన్, మహ్మద్ నిజాముద్దీన్లను అదుపులోకి తీసుకొని వీరివద్ద నుంచి ఫోన్లు, నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వా«దీనం చేసుకొని ఖైరతాబాద్ పోలీసుకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!