Kakinada Crime: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో జరిగింది. గ్రామ శివారులో జీడిమామిడి తోటను ఆనుకుని ఉన్న ఇంట్లో దానబోయిన చిన్నబుల్లి (68) నివాసముంటున్నారు. బర్రెకు నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కోతులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. 20కి పైగా కోతులు మీదపడి దాడి చేయడంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది.
దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నబుల్లి తనకు ఉన్న మూడెకరాల తోటలో తన కూతురు కుటుంబంతో కలిసి అక్కడే నివాసముంటోంది. ఈ ప్రాంతంలో కోతుల దాడిలో గాయపడిన ఘటనలు చాలా జరిగాయని గామస్తులు తెలిపారు. ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని వాపోయారు.
Also read
- ఛీ.. ఛీ.. ఇదేం పని రా.. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులా..?
- శ్రీశైలంలో మహా అపచారం: గర్భగుడిలో మల్లికార్జున స్వామి వీడియో తీసిన భక్తుడు.. సోషల్ మీడియాలో వైరల్!
- Karimnagar SI : గన్నేరు పప్పు తిని భార్య మృతి.. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న SI
- kakinada: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. కోతుల దాడిలో వృద్ధురాలి మృతి
- సినిమా స్టంట్ను తలపించిన స్కార్పియో యాక్సిడెంట్





