కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడప జైల్లో బెదిరించిన ఘటనపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరోసారి విచారణ చేపట్టారు. హత్య కేసు నిందితులకు కడప జైల్లో సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్తోపాటు, అభియోగాలు ఎదుర్కొంటున్న వైద్యురాలు పుష్పలత, ప్రవీణ్ను ఎస్పీ విచారించారు. రెండు వారాల క్రితం ఓ రోజంతా ఇప్పటికే వీరిని విచారించారు. 2023 నవంబర్లో జైలు అధికారుల అండతో తనను చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యుల బృందంతో కమిటీ వేసింది.
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
- శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
- సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
- ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
- Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా





