July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

నకిలీ బ్రాండ్లతో మహిళల మాంగళ్యాలు తెంచి ఖజానా నింపుకుంటున్న జగన్….

*మచిలీపట్నం*
*07/04/2024*

*భూహక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు తాకట్టే…అధికారంలోకి రాగానే భూహక్కు చట్టం రద్దు*…..

*రైతు సమస్యలపై జగన్ కు అవగాహన లేదు…రైతులంటే గౌరవం లేదు*…..

*ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ యేడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం*….

*నకిలీ బ్రాండ్లతో మహిళల మాంగళ్యాలు తెంచి ఖజానా నింపుకుంటున్న జగన్* ….

*నకిలీ బ్రాండ్లు అరికట్టి…ప్రజల ప్రాణాలు కాపాడుతాం*….

*యువత జీవితం చీకట్లో ఉంది…అన్ని వర్గాలు సంక్షోభంలోకి వెళ్లాయి*

ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు…ఉద్యోగం వచ్చేదాకా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం రాగానే అమలు ….

*సూపర్-6 పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు*

తెలుగుదేశం, బిజెపి, జనసేన ఆధ్వర్యంలో మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, పుప్పాల ప్రసాద్, తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి, పి. వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు, లంకి  శెట్టి నీరజ, టిడిపి లీగల్ సెల్ మహిళా న్యాయవాది, మోపిదేవి గోవర్ధనమ్మ, బిజెపి నాయకులు, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, ఎం వెంకటేశ్వరరావు తదితరులు ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు….

  భూ హక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తుల తాకట్టేనని… ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ లు స్పష్టం చేశారు అన్నారు.  జగన్ కొత్తగా తెచ్చిన భూహక్కు చట్టం వల్ల ఎవరి ఆస్తులకూ రక్షణ ఉండదన్నారు. బ్రిటీష్ పాలకులు కూడా చేయని ఘోరమైన పనులు ముఖ్యమంత్రి
జగన్ , వైసీపీ పాలకులు చేస్తున్నారు అన్నారు.

త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు రెండు బటన్లు నొక్కాలి. పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి కి గ్లాసు గుర్తుపై….ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర కి సైకిల్ గుర్తుపై నొక్కాలి. గాజుగ్లాస్, సైకిల్ జగన్ గుండెలపై నిలబడాలి. రాబోయే ఎన్నికలు మన జీవితాలు సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశం’’ అని పిలుపునిచ్చారు. 

*యువత జీవితం చీకట్లో…అన్ని వర్గాలు సంక్షోభంలో*

ఐదేళ్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి, వైసిపి పాలనలో అందరం బాధితులయ్యాం. మన జీవితాలు బుగ్గిపాలయ్యాయి. యువత జీవితం చీకట్లోకి వెళ్లింది..అన్ని వర్గాలు సంక్షోభంలోకి వెళ్లాయి. ఏపీలో ఒక్క రైతు అయినా బాగున్నాడా? ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన వారి పేర్లు నేటికీ  మన మనసులో నిలిచి పోయాయన్నారు.

మనకు తిండి పెట్టే రైతన్న పరిస్థితి జగన్ పాలనలో కుదేలైంది. రైతు సమస్యలపై జగన్ కు అవగాహన లేదు…రైతంటే గౌరవం లేదు. సాగు, రైతును ముంచేశాడు. గోదావరి డెల్టా , కృష్ణా డెల్టా లు
చరిత్రలో ఇంతటి దయనీయ స్థితి ఎప్పుడూ చూడలేదు అన్నారు.

ధాన్యం నింపుకోవడానికి రైతులకు కనీసం గోనె సంచి ఇవ్వలేకపోయాడు. దేశం మొత్తంలో మన రాష్ట్రంలోనే 93 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. 2014లో మన టిడిపి
ప్రభుత్వమే రైతు రుణమాఫీ చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగ చేశాం. కోస్తాలో ఆక్వా రంగాన్ని ఆదుకున్నాం. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి…రూ.7,500లే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.

*ఆక్వారంగాని కి పూర్వవైభవం*చంద్రబాబు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తోనేనే సాధ్యం…

జగన్ మాటలు చూస్తే కోటలు దాటతాయి…చేతలు మాత్రం గడప దాటవు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తాం. రూ.1.50లకే కరెంటు ఇస్తాం. ఎన్డీయే ప్రభుత్వం రాగానే ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇచ్చి ఆదుకుంటాం. రాజకీయాలంటే సేవాభావమని చంద్రబాబు పవన్ కల్యాణ్ లు సాటి చెప్పారు అన్నారు. కూటమి పొత్తుతో టిడిపి, జన సైనికులు, బిజెపి శ్రేణులు మొత్తం ఉత్సాహంగా ఉన్నారు.

జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మరోసారి నష్టపోకూడదనే ఉద్దేశంలో పొత్తుకు చొరవ చూపి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అందరినీ ఐక్యపరిచారుఅన్నారు.

టిడిపి, జనసేన, బిజెపి మనమంతాజట్టు కట్టాం. దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని నరేంద్ర మోదీ కష్టపడుతున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తయారవుతుంది. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. ఏపీలో 160పైగా ఎమ్మెల్యే స్థానాలు మన ఎన్డీఏ కూటమి ద్వారా గెలుస్తున్నాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.

*ఏడువ తారీకు వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవ్*

ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి రూ.13 లక్షల కోట్లు అప్పు తెచ్చి మన నెత్తిపై కుంపటి పెట్టాడు. ఏడువ తారీకు వచ్చినా ఇంత వరకూ ఉద్యోగులకు జీతాలు పడలేదు. వృద్ధులకు పింఛను ఇవ్వకుండా శవ రాజకీయాలు చేసిన నీచుడు జగన్. వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది. తండ్రి చనిపోతే సానుభూతి పొందాడు. బాబాయ్ ని తానే చంపించి ఓటేయమని అడిగాడు. పాత సినిమాలో నాగభూషణం ఉండే వాడు. వాళ్లే చంపేసి వాళ్లే దండేసి ఆ కేసు వేరే వారిపై తోస్తాడు…అలాంటి వ్యక్తిత్తం జగన్ ది. ఫ్యాన్ అరిగిపోయింది…తిరగని ఫ్యాన్ మనకు అవసరమా? ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు చేసి చెత్తకుప్పలో పడేయాలి.  జగన్ కు , వైసిపి శ్రేణులకు
మనం ఏమిటో చూపించాలి అన్నారు.
  జాబ్ రావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. పరిశ్రమలు తెచ్చే శక్తి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉంది అన్నహామీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీలు ఇచ్చారు అన్నారు. 

*సూపర్-6 పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు*

దేశంలోనే 24 శాతం నిరుద్యోగత ఉన్న రాష్ట్రం ఏపీ. భవిష్యత్ లో యువతకు రూ.20 లక్షలఉద్యోగాలు ఇస్తాం. మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. యేటా జాబ్ క్యాలండర్ ఇస్తాం. ఉద్యోగాలు ఇచ్చేవరకూ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు.

పోర్టు ఇతర పరిశ్రమల ఆధారంగా యువతకు స్థానింగానే ఉద్యోగాలు మన ఎంపీ అభ్యర్థి బాలసౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఇప్పిస్తారు అన్నారు.

జగన్ రెడ్డి మనకు ఏం చేశాడయ్యా అంటే జే బ్రాండ్ తెచ్చాడు. డ్రగ్స్ తో యువత భవిష్యత్ నాశనం చేశాడు. వైసీపీ నేతలే గంజాయి అమ్మే పరిస్థితులు తెచ్చారంటే ఏమనాలి?. అన్ని చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులపాలు చేసిన జగన్ రెడ్డిని, వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వారిని చిత్తుగా ఓడించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు.

సూపర్ -6 కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తాం. మహిళలకు డ్వాక్రా పెట్టింది చంద్రబాబు. ఆస్తిలో మహిళలకు సమానహక్కు ఇచ్చింది టీడీపీ. ఉద్యోగాలు, కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టింది టీడీపీ. మహాశక్తి ద్వారా మహిళలను ఆర్థికంగా ఆదుకునేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమన్నారు.

ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇస్తాం. రూ.10 ఇచ్చి రూ.100 దోచే మనిషి జగన్ రెడ్డి’’ అని  విమర్శించారు.

*నకిలీ బ్రాండ్లు అరికట్టి…ప్రజల ప్రాణాలు కాపాడుతాం*

చంద్రబాబు,నరేంద్రమోదీ చేసేది సంపద సృష్టి. చంద్రబాబు సీఎంగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడున్నాయా? ఆనాడు బడ్జెట్ లో 19.9 శాతం సంక్షేమానికి ఖర్చు చేశాం. నేడు 10 శాతం కూడా ఖర్చు చేయడంలేదు. సంక్షేమ పథకాలను కక్షపూరితంగా రద్దు చేసి మాయమాటలు చెబుతున్న జగన్ రెడ్డి ఒట్టి బటన్ నొక్కుతున్నాడు. జగన్ నొక్కే బటన్ కూడా నిలిచిపోయింది. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆస్తుల మేసిన వారిపై చర్యలు తీసుకుంటారు అన్నారు.

బాలశౌరి, కొల్లు రవీంద్ర లు మత్సకారులను ఆదుకుంటారు అన్నారు. వలలు, బోట్లు, డీజిల్ సబ్సిడీలు పునరుద్ధరిస్తా రన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తారు అన్నారు.

   సురక్షిత మంచినీరు అందిస్తాం. రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకప్పుడు క్యార్టర్ రూ.60…..ఇప్పుడు రూ.200. డిజిటిల్ పేమెంట్స్ లేవు. తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపేందుకు నకిలీ మద్యంతో మహిళల మాంగళ్యాలు తెంచాడు.’’ అని వారు ధ్వజమెత్తారు.

Also read

Related posts

Share via