పరుపుపై పడిన అగర్బత్తి – మంటలు అంటుకుని ఇంట్లో సామగ్రి దగ్ధం, మహిళ మృతి
దోమల బాధ తట్టుకోలేక వెలిగించిన అగరబత్తి ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. వెలిగించిన అగరబత్తి పరుపుపై పడి మంటలు చెలరేగడటంతో నిద్రలోనే మహిళ మరణించిన ఘటన విజయవాడ గుణదలలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం, గుణదల 1వ డివిజన్ డీడీ నాయుడు వీధికి చెందిన అగ్రహారపు సుభాషిణి (58) ఆదివారం రాత్రి దోమలు ఎక్కువగా ఉండడంతో వాటిని నివారించడానికి అగరబత్తి వెలిగించారు. అనంతరం ఇంట్లో నిద్రపోయారు. ఆమె గాఢనిద్రలోకి జారుకున్న అనంతరం ప్రమాదవశాత్తు ఆ అగరబత్తి అంటుకోవడంతో ఇళ్లు, ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయింది. ఈ క్రమంలోనే నిద్రలోనే సుభాషిణి మృతిచెందారు.
సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో సుభాషిణి భర్త ఎంత పిలిచినా, ఆమె ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భర్త, స్థానికులు సహాయంతో తలుపులను బలవంతంగా తెరవగా, మంచంపై కాలిన గాయాలతో సుభాషిణి చనిపోయి ఉండడం గమనించారు. వెంటనే మృతురాలి కుమారుడు మహేశ్ గుణదల పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. మృతురాలి కూమారుడి ఫిర్యాదు మేరకు సోమవారం మధ్యాహ్నం కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..? అసలు రహస్యం ఇదే!
- July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- మిస్టరీ బ్లాస్టర్.. నిప్పు లేదు.. సిలిండర్ పేలలేదు.. కానీ కిచెన్లో భారీ పేలుడు! భయాందోళనలో జనం!
- Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
- Watch Video: నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు.. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి..!




