నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
విశాఖపట్నం, పెద్దవాల్తేరు: నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖకు చెందిన ఓ మహిళ తలకు గాయమై సోమవారం రాత్రి ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ చేయించాలని వైద్యులు సూచిచండంతో .. అదే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్కు వెళ్లింది.
ఇదే అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇన్ఛార్జి ప్రకాశ్ .. స్కానింగ్ కోసం దుస్తులు తీసేయాలని చెప్పాడు. ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు ప్రకాశ్కు దేహశుద్ధి చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న విశాఖ మూడో పట్టణ సీఐ రమణయ్య ఆసుపత్రికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో రోగులు నరకం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





