హైదరాబాద్ అత్తాపూర్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మీరాలం ట్యాంక్ సమీపంలో ఏడేళ్ళ బాలుడు హత్యకు గురయ్యాడు. బాలుడి తలపై రాళ్ళతో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారంతో అందుకున్న పోలీసులు బాలుడు ఎవరు? ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ లో ఏడేళ్ల బాలుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగులు బాలుడిని తలపై రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం శవాన్ని అత్తాపూర్ లోని మీరాలం ట్యాంక్ సమీపంలో పడేసారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని నెక్లెస్రోడ్డుకు చెందిన మహమ్మద్ రహీమ్గా గుర్తించారు. బాలుడు ఎవరు? ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అలాగే చుట్టుపక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.
Also read
- వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి…
- 27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
- Pitru Dosham: ఇంట్లో అకస్మాత్తుగా సమస్యలా?.. అది మీ పూర్వీకుల శాపం కావచ్చు, వెంటనే ఈ ఆలయాలను దర్శించండి!
- Mystic Truths: గుడి బయట చెప్పులు మాయమయ్యాయా?.. మీకు లక్ష్మీ దేవి ఇచ్చే సంకేతం ఇదే!
- మద్యం మత్తులో హోం గార్డుపై దాడి!





