మూసాపేట: ఆసుపత్రికి స్కూటీపై వెళుతున్న స్టాఫ్ నర్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన ప్రశాంతి (37) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీహెచ్బీ కాలనీలోని రవి హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది.
శనివారం జగద్గిరిగుట్టలోని ఇంటి నుంచి ఆసుపత్రికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి వెళుతోంది. నెక్సాస్ షోరూమ్ వద్ద మలుపు వద్ద కూకట్పల్లి వైపు వేగంగా వెళుతున్న వెనుకనుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Also read
- Rajendranagar Murder Case: రాజేంద్రనగర్ వృద్ధ దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ.. పగతోనే దారుణం!
- Warangal: అర్ధరాత్రి పోలీస్ వీరంగం.. బైక్ ఆపలేదనీ చెంప చెళ్లుమనించిన SI బాబు! రాత్రంతా కుటుంబం అడవిపాలు
- 60 ఏళ్ల వృద్ధురాలి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. ఎవరో తెలిసి షాక్!
- మాములు దొంగలు కాదు వీళ్లు.. ఏకంగా ఆస్పత్రిలోనే చక్కపెట్టేశారు..!
- కూతురికి వాతలు పెట్టిన తండ్రి…భర్తపై ఫిర్యాదు చేసిన భార్య