ఎల్బీనగర్ : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన మహాలక్ష్మి (19), వేణుగోపాలు పెద్దల సమక్షంలో గతేడాది ఆగస్టులో వివాహం జరిగింది. తాగుడుకు బానిసగా మారి భార్య బంగారు నగలను అమ్ముకున్నాడు. కొంత బంగారాన్ని ఆమె పుట్టింట్లో దాచగా.. వాటిని తెమ్మని భార్యను వేధిస్తున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వేణుగోపాలు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినా అతడి తీరు మారలేదు. ఆదివారం బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి వెళదామని భార్య కోరగా ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో బ్లేడు తీసుకొని ఆమె గొంతు కోశాడు. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతోంది. నిందితుడు వేణుగోపాల్ను నాగోల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





