మానవత్వం మంట కలిసింది. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవలసిన కుటుంబ సభ్యులు రోడ్డుపై వదిలేశారు. ఏకంగా ఆమెకు వస్తున్న పెన్షన్ మాత్రం తీసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఆమె బాగోగులు పట్టించుకోకుండా ఆమె పెన్షన్ డబ్బులకు వచ్చి డబ్బులు పట్టుకుపోతున్న కుటుంబ సభ్యులను బస్టాండ్ వద్ద ఉన్న ఆటో డ్రైవర్లు, పళ్ళ వ్యాపారులు అడ్డుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం వెలుగు చూసింది. మతిస్థిమితం లేని మహిళను మానవత్వం లేకుండా రోడ్డు మీదే వదిలేశారు కుటుంబ సభ్యులు. అయితే నెల నెలా వచ్చే పెన్షన్ డబ్బులు మాత్రం తీసుకుని వెళ్ళిపోతున్నారు. కొత్తపేట మండలం మందపల్లికి చెందిన మద్ధింశెట్టి బంగారమ్మను మతిస్థిమితం లేకపోవడంతో కుటుంబసభ్యులు వదిలించుకోవలనుకున్నారు. దీంతో అమలాపురం బస్ స్టాండ్ వద్ద కొన్ని ఏళ్ళ క్రితం వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు.
అయితే ఆమెకు నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బులను వదలడంలేదు.ప్రతి నెల ఆమెకు వచ్చే పెన్షన్ ను సచివాలయం ఉద్యోగిని తీసుకువచ్చి వేలిముద్ర వేయించి డబ్బులు తీసుకెళ్లి పోతున్నారు కుటుంబ సభ్యులు. ఆమె బాగోగులు పట్టించుకోకుండా ఆమె పెన్షన్ డబ్బులకు వచ్చి డబ్బులు పట్టుకుపోతున్న కుటుంబ సభ్యులను బస్టాండ్ వద్ద ఉన్న ఆటో డ్రైవర్లు, పళ్ళ వ్యాపారులు అడ్డుకున్నారు. వృద్ధురాలి మంచిచెడ్డని కుటుంబసభ్యులకు పెన్షన్ డబ్బులు తీసుకెళ్లడం ఏంటని నిలదీశారు. కొన్నాళ్ళుగా ఆమెకు భోజనం పెడుతూ, అన్ని మంచిచెడ్డలు మేము చూస్తున్నామని, ఆమె ఆలనా పాలనా చూడకుండా ఆమె డబ్బులకు వస్తారా అంటూ మండిపడ్డారు. పెన్షన్ ఇస్తున్న సచివాలయ ఉద్యోగపైన చర్యలు తీసుకోవాలంటే ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





