చీరాల: బాపట్ల జిల్లా చీరాల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం జరిగింది. విశ్రాంత వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కాజేసిన ఘటన కలకలం రేపింది. చీరాలకు చెందిన ఓ విశ్రాంత వైద్యుడికి ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. మనీలాండరింగ్కు పాల్పడ్డావంటూ బెదిరించారు. డబ్బులు పంపిస్తే తిరిగి ఖాతాలో జమచేస్తామని చెప్పారు. నిజమేనని నమ్మిన విశ్రాంత వైద్యుడు.. పలు దఫాలుగా రూ.1.10 కోట్లు పంపించాడు. ఆ తర్వాత నగదు తన ఖాతాలో జమకాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చీరాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఒకటో పట్టణ సీఐ సుబ్బారావు తెలిపారు.
Also read
- బెడ్రూమ్లో భార్య.. బాత్రూమ్లో భర్త ఆత్మహత్య.. ఆ దంపతులకు వచ్చిన కష్టమేంటంటే?
- ఆలయంలోని మహిళల బాత్రూంలో చొరబడి రహస్య వీడియోలు రికార్డ్
- Andhra: ఎంతపని చేశావ్ మానస.. బాయ్ఫ్రెండ్ చెప్పినట్లు చేసింది.. చివరకు
- అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా సెక్రటేరియట్ లోపలికి వెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..
- తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి.. ఎందుకంటే..





