SGSTV NEWS
Andhra PradeshCrime

వాట్సాప్‌ కాల్‌లో చూపిస్తూ మరీ కొట్టారు.. విడదల రజినిపై ఫిర్యాదు

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. చిలకలూరిపేట ఐటీడీపీ నేతలు పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి విడదల రజినిపై ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులతో విడదల రజిని తమను వేధించారంటూ ఫిర్యాదు చేశారు. విడదల రజినితో పాటుగా ఆమె పీఏపైనా కంప్లైంట్ చేశారు. తమ ఫిర్యాదు మీద ఎస్పీ చర్యలు తీసుకోవాలని ఐటీడీపీ నేతలు కోరారు. మరోవైపు ప్రశ్నించే గొంతులను టీడీపీ కూటమి సర్కారు కేసుల పేరుతో అణిచివేస్తోందని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.


మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినిపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో విడదల రజిని తమను అక్రమ కేసులతో వేధించారంటూ చిలకలూరిపేట ఐటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి విడదల రజినితో పాటు ఆమె పీఏ రామకృష్ణ, జయ ఫణీంద్ర కుమార్ మీద.. అలాగే గతంలో చిలకలూరిపేట అర్బన్ సీఐగా పనిచేసిన సూర్యనారాయణపైనా ఐటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మార్ఫింగ్ పోస్టులు పెట్టామంటూ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని.. అక్రమంగా నిర్బధించి వేధించారంటూ ఫిర్యాదులో ఆరోపించారు.



తమను చిత్రహింసలకు గురిచేస్తూ ఆ వీడియోలను వాట్సాప్‌లో విడదల రజిని, ఆమె పీఏలకు చూపించేవారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ చిలకలూరిపేట నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు.. పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకమైన పోస్టులు పెట్టినవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాజకీయ నేతలతో పాటు వారి కుటుంబంలోని మహిళలపై ఇష్టానుసారం పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పలుచోట్ల అరెస్ట్‌లు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విడదల రజిని వేధించారంటూ పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు అందడం ప్రాధాన్యం సంతరించుకుంది.


మరోవైపు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను వైసీపీ తప్పుబడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారనే కారణంగానే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేవలం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైనా అరెస్టుల పర్వం నడుస్తోందని.. టీడీపీ తరుఫున సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినవారి సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజధర్మమా అంటూ నిలదీస్తున్నారు. అయితే తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని.. వైసీపీ నేతల కుటుంబసభ్యులపై అభ్యంతరకరమైన పోస్టులను చేసే వారిని కూడా వదలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే హెచ్చరించారు

Also read

Related posts

Share this