తెనాలి శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకొంది.
గుంటూరు : తెనాలి శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకొంది. తెనాలి రూరల్ సీఐ బి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బుర్రిపాలెం రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు యువకుడి గొంతు కోసి హత్య చేశారు. ఉదయం యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు బుర్రిపాలెం గ్రామానికి చెందిన పేరిశెట్టి కోటేశ్వరరావు(34)గా గుర్తించారు. మంగళవారం ఉదయం వ్యక్తిగత పనులమీద తెనాలికి వెళ్లిన కోటేశ్వరరావు.. తిరిగి ఇంటికి రాలేదని అతని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే కోటేశ్వరరావు గతంలో పలువురి సెలబ్రిటీల వద్ద బౌన్సార్గా పనిచేసినట్లు చెప్పారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సిఉంది.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Ap Crime News: ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.